నిద్రిస్తున్న వ్యక్తిని హత్య చేసిన దుండగులు

60చూసినవారు
తెలంగాణలో మరొక దారుణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడ్ పల్లి గ్రామానికి చెందిన రూల ఖాన్(58) తన ఇంట్లో నిద్రిస్తుండగా హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు బైక్, స్కూటీలపై వచ్చి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇంట్లో గొడవ జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి సమయం వాళ్ళు గ్రామంలోకి వచ్చి వెళ్ళుతుంటే గ్రామస్తులు పట్టుకున్నారు. హంతకులు తప్పించుకోగా.. వాహనం వదిలి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్