మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) క్రికెట్ లవర్స్ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 23 నుంచి 2వ సీజన్ ప్రారంభకానున్న నేపథ్యంలో ఆయా ప్లేయర్లు తమ జట్లతో చేరుతున్నారు. తాజాగా ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బెంగళూరులోని ఆర్సీబీ క్యాంపులో చేరారు. ఇక ఈ సీజన్లో మొదటి దశ మ్యాచ్లు బెంగళూరు, ఆ తర్వాతి మ్యాచ్లు ఢిల్లీలో జరగనున్నాయి. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.