టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవాలంటే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్
కోహ్లీ ఉండాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. వన్డే ఫార్మాట్లో సూపర్ ఫామ్ కనబర్చిన ఈ స్టార్ ఆటగాళ్లు
టీ20 ఫార్మాట్లో పునరాగమనం చేయాలని సూచించారు. ఈ ఇద్దరూ జట్టులో ఉంటే టీమిండియాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాగా ఈ ఏడాది జూన్ 1 నుంచి 29 వరకు
అమెరికా, వెస్టిండీస్ వేదికగా
టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది.