WPLలో భాగంగా ఇవాళ గుజరాత్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన బెంగళూరు అందులో మూడు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ ఆడిన నాలుగు మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్లో అయినా బోణీ కొట్టాలని చూస్తోంది.