ప్రపంచకప్ టీ20లో భాగంగా నేడు ఆఫ్గనిస్తాన్తో భారత్ కీలక పోరులో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని తెలియడంతో ఓ స్పిన్నర్ని తీసుకుంటే బెటరని భారత జట్టు మేనేజ్మెంట్ భావించిందట. ఈ నేపథ్యంలోనే కుల్దీప్ యాదవ్ని రంగంలోకి దింపినట్టు తెలిసింది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో అతనిని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.