టోల్‌ప్లాజా ఉద్యోగిపై కారు ఎక్కించాడు (వీడియో)

57చూసినవారు
తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కెపిలూరు టోల్‌బూత్‌ వద్ద ఓ వ్యక్తి కారుతో వచ్చాడు. అయితే టోల్ చెల్లించకుండా వెళ్లడానికి టోల్‌ప్లాజా ఉద్యోగి అభ్యంతరం తెలిపాడు. దీంతో ఆ ఉద్యోగితో కారులోని వ్యక్తి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కారు డ్రైవర్ సహనం కోల్పోయాడు. టోల్‌ప్లాజా ఉద్యోగి పైకి కారు ఎక్కించాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్