సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా రేపు ఐదో విడత పోలింగ్ జరుగనుంది. ఇందులో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ సీట్లకు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (రాయ్బరేలీ)తోపాటు రాజ్నాథ్ సింగ్ (లక్నో), పీయూష్ గోయల్ (ముంబై-ఉత్తర), స్మృతి ఇరానీ (అమేథీ), సాధ్వీ నిరంజన్ జ్యోతి (ఫతేహ్పుర్), శంతను ఠాకుర్ (బన్గావ్) తదితర కేంద్రమంత్రులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.