విహారయాత్రలో విషాదం.. ఐదుగురు మృతి

268768చూసినవారు
విహారయాత్రలో విషాదం.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని నాగపూర్ లో విషాదం చోటుచేసుకుంది. హింగ్నా ప్రాంతంలో ఉన్న సరస్సు వద్దకు విహారయాత్రకు వచ్చిన యువకులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందారు. మొత్తం 8 మంది యువకులు విహారయాత్రకు రాగా, వారిలో ఓ యువకుడు నీటిలో దిగి మునిగిపోయాడు. అతడ్ని కాపాడేందుకు యత్నించిన మరో నలుగురు సైతం నీటిలో మునిగి మృతిచెందారు. మృతులను వైభవ్(20), నితిన్(21), రాహుల్(21), శంతను(21), రిషికేశ్(21)గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్