ప్రేమ, పెళ్లి సాకుతో యువతిపై ట్రైనీ ఎస్సై అత్యాచారం (వీడియో)

81చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లోని ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. పంకి పోలీస్ స్టేషన్‌లోని అనూజ్ తివారీ అనే ట్రైనీ సబ్-ఇన్‌స్పెక్టర్ ఓ మహిళను ప్రేమించి, పెళ్లి సాకుతో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో, నిందితుడు తన వ్యక్తిగత ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. తనపై అతని సోదరుడు, సోదరితో కలిసి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్