జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా స్నేహ శబరీష్, మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్ఈగా వెంకటరమణ, ఫలక్నుమా డిప్యూటీ కమిషనర్గా వై.శ్రీనివాస్రెడ్డి, కుత్బుల్లాపూర్ డీసీగా వి.నర్సింహ, సంతోష్నగర్ డీసీగా ఎ.నాగమణి, చార్మినార్ డీసీగా ఎ.సరిత, ఫలక్నుమాకు ఏసీగా డి.లావణ్యను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.