హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రజా పాలన దరఖాస్తులు, ఆరు గ్యారంటీల అమలుపై కీలక చర్చలు జరపనున్నారు. కొత్త పథకాలకు నిధుల సమీకరణపై సీఎం, మంత్రులు చర్చించనున్నారు. అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని
కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.