హైదరాబాద్లోని అల్వాల్లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన డీసీఎం వ్యాను పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తిరుపాల్(9) అనే బాలుడు మృతి చెందగా, అతని తల్లికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసి.. ఆమె తన ఇద్దరు పిల్లలతో ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.