కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలులోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.