టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. కాగా ,టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ గత నెలలో నిర్వహించారు. ఏపీ, తెలంగాణలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 30 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.