TS: విషాదం.. గంట వ్య‌వ‌ధిలో తల్లీకుమారుడి మృతి

122458చూసినవారు
TS: విషాదం.. గంట వ్య‌వ‌ధిలో తల్లీకుమారుడి మృతి
మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉద‌యం నరసింహగౌడ్‌(36)కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యం తెలుసుకున్న అతడి తల్లి లక్ష్మి(57) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమె కూడా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నర్సింహగౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్