ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. "నేను వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నా. అలాగే కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా." అని రాయుడు ట్వీట్ చేశారు. కాగా, సీఎం జగన్ సమక్షంలో రాయుడు డిసెంబర్ 28వ తేదీన
వైసీపీ కండువాను కప్పుకున్నారు.