హర్యానాలోని రేవారీలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. కోచింగ్ సెంటర్కు వెళ్తున్న 19 ఏళ్ల విద్యార్థి అంకిత్ను దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం అంకిత్కు బలవంతంగా మద్యం తాగించి, ఆపై దాడికి పాల్పడ్డారు. దుస్తులు చింపేసి, స్పృహ కోల్పోయే వరకు నిర్దాక్షిణ్యంగా కొట్టారు. అంతటితో ఆగకుండా కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో మరో వ్యక్తి సైతం గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.