ఒకే ఫోన్లో రెండు సిమ్కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారులకు టెలికం సంస్థ జరిమానా విధించబోతున్నదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. నిజానికి ఇది తప్పుడు వార్త. విచ్చలవిడిగా పెరిగిపోతున్న నంబర్లకు అడ్డుకట్ట వేయాలని మాత్రమే TRAI భావిస్తోంది తప్ప ఒకే ఫోన్లో రెండు సిమ్కార్డులను ఉపయోగిస్తున్న వారికి జరిమానా విధించే ప్రతిపాదన లేదని తెలిపింది.