రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు

82చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్‌ గాయపడ్డారు. తన సొంత నియోజకవర్గమైన యూపీలోని ఫిలిబిత్‌లో శనివారం ఆయన పర్యటించారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని ఓ వాహనం ఆయన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ బయటపడ్డారు. అనంతరం మరో కారులో వెళ్లి, వరద బాధితులను ఆయన పరామర్శించారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్