టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు అరుదైన గౌరవం దక్కింది. టీ20 వరల్డ్ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా యూవీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమాల్లో యువీ పాల్గొననున్నారు. కాగా జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికాలో జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనుండగా, జూన్ 5న ఐర్లాండ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.