AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఊరటనిచ్చారు. ఉద్యోగులపై భారం పడుతోందని, దీన్ని తగ్గిస్తామని అన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ, ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, ప్రస్తుతం ఉన్న అద్దె భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు.