బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీలోని ఫిలిబిత్ నియోజకవర్గానికి జితిన్ ప్రసాద్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ తరుణంలో వరుణ్కు కాంగ్రెస్ ఆహ్వానం పలికింది. 'వరుణ్ విద్యావంతుడు. ఆయనపై అవినీతి ఆరోపణలు లేవు. ఆయనను కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం' అని అధీర్ రంజన్ చౌదరి మంగళవారం పేర్కొన్నారు.