తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత 'ఆప్' సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్’ అనే క్యాప్షన్తో కూడిన సీఎం ఫొటోను వాట్సాప్ డీపీలుగా పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సూచించారు. మోదీని ఎదుర్కొనే ఏకైక నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల సమయంలో ఆయనను అరెస్టు చేశారు.