ప్రముఖ హిందీ, భోజ్పురి నటుడు రాకేశ్పాండే (77) కన్నుమూశారు. శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆయన 1969లో ‘సారా ఆకాశ్’ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘దో రహ (1971)’, ‘హో మైన్ నహీన్ (1974)’, ‘హేయి హై జిందగి (1977)’ చిత్రాలతో రాకేశ్ పాండే గుర్తింపు పొందారు.