కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణ సమీపంలో గాలి దుమారానికి చెట్టు విరిగిపడి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. న్యాల్కల్ మండలం శంషోలాపూర్ గ్రామానికి చెందిన అశ్వంత్, లోకేష్ ఇద్దరు కలిసి బైక్పై బీదర్కు కిరాణా సామాను తీసుకునేందుకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో షాపూర్ గ్రామ సమీపంలోని రైల్వే గేటు వద్ద ఉన్న చెట్టు గాలి దుమారానికి విరిగి బైక్పై పడిపోయింది. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.