మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో దారుణం జరిగింది. ఎంపీ రేవా జిల్లాలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడు యువతిని దారుణంగా కొట్టాడు. అక్కడి ప్రాంతమంతా తిప్పుకుంటూ ఆ మహిళపై దాడిచేశాడు. అయితే వారిద్దరి మధ్య అసలు గొడవ ఎందుకు జరిగిందో అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.