భారత్, చైనా సైనికుల మధ్య క్రీడ ఏదైనా తగ్గపోరు పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ కింద ఆఫ్రికాలోని సూడాన్లో మోహరించిన సమయంలో భారత సైనికులు, చైనా సైనికుల మధ్య టగ్ ఆఫ్ వార్ ఆట నిర్వహించారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.