ఏపీలో ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.