మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. తమిళనాడులోని తిరునెల్వేలిలో రోడ్డుపై రెండు ఆవులు పోట్లాడుకున్నాయి. ఈ క్రమంలో కోర్టు ఉద్యోగి వేలాయుధరాజ్ బైక్పై వస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ ఆవు అతడిని ఢీకొట్టింది. దీంతో వేలాయుధ రాజ్ కిందపడ్డాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బస్సు వేలాయుధరాజ్పై నుంచి దూసుకెళ్లింది. బస్సు చక్రాల కింద నలిగిపోవడంతో సంఘటనా స్థలంలోనే ఆ వ్యక్తి చనిపోయాడు.