రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలో పగలు రాత్రి అనే బేధం లేకుండా 24 గంటలు బెల్ట్ షాప్ లలో మద్యం విక్రయిస్తున్నారు. దీంతో వాటిని వెంటనే మూసివేయాలని గ్రామ కూడలిలో నిరసనకు దిగాడు. దీనిపై రంగారెడ్డి జిల్లా అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.