రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు దాడులుచేసి పట్టుకున్న ఘటన సోమవారం కోస్గి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని హకీంపేటలో ఆటోలో లోడ్ చేసిన బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనంలో 3క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. బియ్యాన్ని స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్ లో అప్పగించి, ఆటో యజమానిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు.