దౌల్తాబాద్ లో బిజెపి నేతల ప్రచారం

72చూసినవారు
దౌల్తాబాద్ మండల బిజెపి అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని తిరుమలాపురం, బాలంపేట, నాగసర్ గ్రామాల్లో చెరువుల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజ వర్ధన్ రెడ్డి, త్రివిక్రమ్ రెడ్డి, కొండ్రు నరసింహులు ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్