గోల్కొండ కోటలో ఒగ్గుడోలు ప్రదర్శన

70చూసినవారు
గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు 20 మంది పాల్గొని చేసిన ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ప్రదర్శనను తిలకించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించినట్లు ఆ సంఘం అధ్యక్షులు బీరప్ప తెలిపారు.

సంబంధిత పోస్ట్