నీటి పొదుపుపై విద్యార్థుల ప్రతిజ్ఞ

559చూసినవారు
కోస్గి మండలం ముశ్రీఫాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నీటి పొదుపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం దృశ్య శ్రవణం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకున్నారు. సకల జీవజాతుల మనుగడ నీటిపైనే ఆధారపడి ఉంటుందని హరిత దళ పాఠశాల స్థాయి సమన్వయకర్త మల్లేష్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్