ప్రచారంలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే

61చూసినవారు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గురువారం రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్