పూడూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి దేవత విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. దైవభక్తితో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.