రమణీయం కమనీయం రాములోరి కళ్యాణం బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని పరిగి పట్టణంలో సీతారాముల కల్యాణ వైభోగం కనులారా తిలకించేందుకు భక్తకోటి ఆలయానికి చేరుకున్నారు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. దీంతో పరిగి పట్టణంలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉమా రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.