వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగులు రమేష్, నరేష్ బయటికి వెళ్లాలంటే వీల్ చైర్ పై వెళ్లేవారు. గతంలో దాతలు ఇచ్చిన వీల్ చైర్ విరిగిపోయిందని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వీల్ చైర్ ఇప్పించాలని రమేష్, నరేష్, దాతల కోసం ఎదిరి చూస్తున్నట్లు గురువారం తెలిపారు.