సర్వం సిద్ధం.. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి

9015చూసినవారు
కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి పట్టణంలో బుధవారం(నేడు) నిర్వహించే బహిరంగ సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ. 4369. 143 కోట్లు విలువచేసే 20 పనులకు కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో వెనుకబడిన స్థాయి నుంచి వడివడిగా ప్రగతి పథాన పయనిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్