తాండూరు నియోజకవర్గంలో చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ స్పీడ్గా కొనసాగుతోంది. సహాయ ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బందికి ఇటీవలే శిక్షణ తరగతులను నిర్వహించి పూర్తి చేశారు. తాజాగా తాండూరు అసెంబ్లీ సిగ్మెంట్ కోసం 277 ఈవీఎం యంత్రాలతో పాటు రిజర్వ్ యంత్రాలను కేటాయించగా వాటిని తాండూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.