పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని ఆ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు కోరారు. గురువారం తాండూరు పట్టణంలోని సీతారాంపేట్, గుమాస్తా నగర్, వాసవీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచి హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలను నమ్మొద్దని సూచించారు.