హిందూ ముస్లింల మద్య ఉండే సోదర భావాన్ని ఇఫ్తార్ విందులు చాటి చెప్తాయని బీఆర్ఎస్ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.