ఐపీఎల్లో భాగంగా బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి తర్వాత కేకేఆర్ ప్లేయర్లను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కలిశారు. యువ బ్యాటర్లను అభినందిస్తూ వారికి పలు సూచనలు చేశారు. ఈక్రమంలో డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీతో దిగిన ఫొటోలను కేకేఆర్ ప్లేయర్ రింకూ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు పలు సూచనలు చేసి స్పెషల్ బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చినందుకు థాంక్స్ అని రింకూ సింగ్ పేర్కొన్నారు.