టీ20 ప్రపంచకప్లో-2024 భారత్కు ఉన్న ఏకైక ఆందోళన విరాట్ కోహ్లీ ఆటతీరు గురించే. అతడు ఈ టోర్నిలో ఘోరంగా విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. దీనిపై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. కోహ్లీని వన్డౌన్లో పంపిస్తే మంచిదన్నాడు. ఓపెనర్గా రిషభ్ పంత్ లేదా యశస్విని తీసుకొస్తే బెటరని వ్యాఖ్యానించాడు.