బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం గజ్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్పై కోపంతోనే ప్రజలకు కాంగ్రెస్కు ఓటేశారని, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే ఓటేస్తామని చెబుతున్నారని అన్నారు. దేశంలో మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత బీజేపీదే అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని, మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.