ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటేసేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. నగరంలోని సెటిలర్లు బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్- విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్జామ్ అవుతోంది. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారూ నగరం నుంచి స్వగ్రామాలకు బయల్దేరారు. దీంతో హైదరాబాద్ శివారు హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.