బీడీ కార్మికులకు వేతన పెంపు

13382చూసినవారు
బీడీ కార్మికులకు వేతన పెంపు
TG: రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్ల వేతన పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం వెయ్యిబీడీలు చుడితే వారికి రూ.245.08 అందుతుండగా.. అదనంగా రూ.4.25 పెంచనున్నారు. బోనస్‌ అన్నీ కలిపితే ప్రతి వెయ్యి బీడీలకు వేతనం రూ.249.99కి చేరుతోంది. బీడీ ప్యాకర్లు ప్రస్తుతం పొందుతున్న వేతనాలపై నెలకు అదనంగా రూ.3,650 ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్