ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ 14 చివరి తేదీగా UIDAI నిర్ణయించింది. ఆ తర్వాత అప్డేట్ చేసుకొనేవారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. గత పదేళ్లుగా ఆధార్కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకోనివారు ఈ ఉచిత అప్డేట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే జూన్ 14 తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్ కార్డు పనిచేయకుండా పోతుందని జరుగుతున్న ప్రచారాన్ని UIDAI ఖండించింది.