లోక్సభ ఎన్నికల సమయంలో వరంగల్ BRS పార్టీకి షాక్ తగిలింది. తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగ్గారెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.