తెలంగాణ పక్కన వున్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ రాతెంగా ములమలుపు వద్ద ఆదివారం సీఆర్పీఎఫ్ జవాన్లతో నిండిన బస్సు బోల్తా పడింది. ఎన్నికల డ్యూటీ కోసం సైనికులంతా పుష్పల్ నుండి కొండగావ్ వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది సైనికులు, డ్రైవర్ గాయపడ్డారు. సైనికులందరూ 188 బెటాలియన్కు చెందినవారు. సైనికులను ప్రథమ చికిత్స కోసం లోహందీగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు పంపారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.